SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజి వద్ద జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు స్టాపర్లు మరియు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ
ఇరుగు రవి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ వట్టిమర్తి జాతీయ రహదారిపై స్టేజి ఉన్నట్టుగా ఎలాంటి హెచ్చరిక బోర్డులు స్టాపర్లు లేకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే భారీ గేట్లు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు దూదిగామ ప్రభాకర్ ,బోయిని మహేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS