SAKSHITHA NEWS

లుపిన్ ఫార్మా కంపెనీ వరద బాధితుల రూ.2 లక్షలవిరాళం

సాక్షిత : పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ వరద బాధితుల సహాయనిధికి లుపిన్ ఫార్మా కంపెనీ 2 లక్షల రూపాయల చెక్కును జే.శివశంకర్ రెడ్డి జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కి శ్రీనివాసరావు డీజీఎం హెచ్ఐర్ అందజేశారు. తుఫాను విపత్తుకి విజయవాడ, పరిసర ప్రాంతాలు జలమయం అవ్వడమే కాకుండా తీవ్ర పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.

సిఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఐఏఎస్ పిలుపుమేరకు వరద బాధితుల సహాయ నిధికి ఆర్థిక సహాయం సామాజిక బాధ్యతలో భాగంగా అందజే యడం జరిగిందని ఎన్. శ్రీనివాసరావు డీజీఎం హెచ్ఐర్ పేర్కొన్నారు. విపత్తు నుండి విజయవాడ పరిసర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని యధాస్థితికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జే వి వి ఎస్ నారాయణ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫాక్టరీస్, పీ. చిన్నారావు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, లుపిన్ ఫార్మా కంపెనీ నుండీ ఎస్. అప్పారావు, సేఫ్టీ మేనేజర్ కేదార మల్లా , ఫైనాన్స్ మేనేజర్ డి. వెంకట నారాయణ సీ ఎస్ ఆర్ మేనేజర్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS