SAKSHITHA NEWS

అర్హులైన రైతులకు అందని రుణమాఫీ
-మాజీ జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

అర్హులైన అందరికీ రైతు రుణ మాఫీ జరగలేదని మాజీ జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంకెన రమేష్ మాట్లాడుతూ రెండు లక్షల లోపు అర్హత ఉన్న రైతులకు కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని వారు అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వ మాయ మాటలతో మభ్య పెట్టే విధంగా పరిపాలన సాగిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందాలని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ధర్నాలో రాస్తారోకోలు చేస్తామని వారు అన్నారు.


SAKSHITHA NEWS