SAKSHITHA NEWS

మదర్ సర్వీస్ సొసైటీ” 2వ వార్షికోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ.

ఆవిష్కరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,

అంతర్జాతీయ గుర్తింపు పొందిన “మదర్ సర్వీస్ సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ని స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్లను విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆవిష్కరించారు.

సమాజసేవకు అంకితమై వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్నవారిని ప్రోత్సహిస్తూ, తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారాక రామారావు పేరు మీద మరియు స్వతంత్ర సమరయోధులు – మహనీయుల పేరు మీదన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తమరు ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని కోరారు.


SAKSHITHA NEWS