SAKSHITHA NEWS

కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ * ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు సమస్యలపై డ్యూటీ డాక్టర్ విజయచంద్ర ని మరియు సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకోవడంతో స్టాఫ్ నర్స్ లను పెంచాలని, హాస్పిటల్ లో ప్లంబింగ్ వర్క్, పలు సమస్యలున్నాయని, వార్డు రూములలో విద్యుత్ దీపాలు వెలగడం లేదని కార్పొరేటర్ కి తెలుపడంతో *ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ఆశ వర్కర్లు, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జాహిద్ షరీఫ్ బాబా, టిఆర్ఎస్ రాజు, శ్రీనివాస్ యాదవ్, గంగపుత్ర శంకర్, రాము యాదవ్, కళ్యాణ్ నాయక్, వెంకటమ్మ, రేవతి, సన్నరాజుల లక్ష్మి, చిట్టెమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS