SAKSHITHA NEWS

ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన కూచారం గిరిజన యువకులు

…,….,.,.,..,..,.,

సాక్షిత మెదక్ జిల్లా:
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జైత్రం తండాకు చెందిన గిరిజన యువకులు పెద్ద సంఖ్యలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.కూచారం గ్రామానికి చెందిన మెదక్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది గిరిజన యువకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, జిల్లాలోని పలువురు నాయకుల ద్వారా ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు.

బీజేపీ పార్టీలో చేరిన గిరిజన యువకులు విజయ్ నాయక్, కిషన్ నాయక్, నరేందర్ నాయక్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గిరిజన యువకులు మాట్లాడుతూ.. కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తమ గిరిజన తండాను అభివృద్ధి చేయడంలో మండల బీఆర్ఎస్ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గిరిజన యువకులు వాపోయారు…


SAKSHITHA NEWS