SAKSHITHA NEWS

Kompalli new commissioner Srihari met MLC Shambhipur Raju

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన కొంపల్లి నూతన కమిషనర్ శ్రీహరి, పాలకవర్గం….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కె. శ్రీహరి గారు ఈరోజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, డీఈ చిరంజీవులు, ఏఈ ప్రవీణ్, దూలపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు చింతల రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, బీఆర్ఎస్ పార్టీ కొంపల్లి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, వినోద్, ప్రవీణ్,కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS