SAKSHITHA NEWS

కోమటి కుంట చెరువును సందర్శించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ ఎన్టీఆర్ నగర్ లో గల కోమటి కుంట చెరువును ఈ రోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి . ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కొద్దీ రోజులుగా కురిసిన భారీ వర్షాలు సంధర్భంగా కోమటి కుంట చెరువు లో నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.చెరువులోకి మురికి నీరు రాకుండా చేయాలని అధికారులకు సూచించారు. చెరువు లో చెత్తా చెదారాలను తొలిగించి పూర్వపు వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.కోమటి కుంట ను కబ్జాకు గురికాకుండా రక్షించి, సుందరికరించి అందంగా తీర్చిదిద్దాలి అన్ని కోరారు.కోమటి కుంట చెరువు సుందరికరణ పనుల వలన ప్రజలకు ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలి అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ పావని, సీనియర్ నాయకులు ముళగిరి శ్రీనివాస్ ,ప్రభాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS