SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్ సీఐడీకి కాదంబరి కేసు

ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటిపై వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. చంద్రబాబు సర్కార్ ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీఐడీకి అప్పగించింది.. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ కేసు వెనుక సూత్రధారుల ఎవరో తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు అన్ని ఫైల్స్ సీఐడీకి అప్పగించాలని డీజీపీ ఆదేశించారు.


SAKSHITHA NEWS