SAKSHITHA NEWS

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా జ్యోతి భీమ్ భరత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీ భవన్ లో జిల్లా అధ్యక్షురాలు జయమ్మ చేతుల మీదుగా జ్యోతి భీమ్ భరత్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ
సహకారంతో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు. రాబోయే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే, మహిళా
హక్కుల కోసం పనిచేస్తూ రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. తన
నియామకానికి సహకరించిన జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

జ్యోతి భీమ్ భరత్ తో పాటు.. శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాగమణి, మునిసిపల్ అధ్యక్షురాలిగా సింధుజ, మొయినాబాద్ మండల అధ్యక్షురాలుగా కావ్య నియమితులయ్యారు.

Whatsapp Image 2024 01 23 At 3.56.31 Pm

SAKSHITHA NEWS