SAKSHITHA NEWS

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి – జిట్ట నగేష్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో శుక్రవారం రాత్రి సిపిఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిట్ట నగేష్ హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపటం కోసం సహపంక్తి బోజనాలు పెట్టించి,దేవాలయాల్లో కి తీసుకెళ్ళిన సుందరయ్య జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని కొనియాడారు. ముందుగా సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం గ్రామంలో మేడే ప్రదర్శన చేసి ఎర్రజండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కల్లూరి కుమారస్వామి, గ్రామ శాఖ కార్యదర్శి కందగట్ల గణేష్, మాజీ సర్పంచ్ వడ్డెపల్లి ఎల్లయ్య, నాయకులు కల్లూరి లక్ష్మయ్య, మందుగుల యాదయ్య, కర్నాటి భిక్షం, పోలోజి ఈశ్వరాచారి, గంజి లక్ష్మయ్య, నర్సింహ్మచారి, చెన్నొజు పాండు, చెన్నొజు విష్ణుమూర్తి క్షత్రయ్య,రూపని బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS