SAKSHITHA NEWS

తెలంగాణపై బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతుంది – జిట్ట నగేష్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

తెలంగాణ పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విమర్శించారు. చిట్యాలలో శనివారం నాడు ప్రదాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు పర్చటంలో పూర్తిగా విఫలం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌక గా అమ్ముతూ ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుండా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారని చెప్పారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణా కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనందుననే సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య ,జిట్ట సరోజ, పార్టీ మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దులు, కడగంచి నర్సింహ, చారి, రమేష్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS