SAKSHITHA NEWS

జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే…
సాక్షిత : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ ఆశించినట్టుగానే స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ కలను సాకారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS