SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా వినుకొండ

ప్రజలను కష్టాలపాలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం..

పన్నుల భారంతో దోపిడి

వార్డుల్లో అభివృద్ధి శూన్యం

ఎమ్మెల్యే స్వార్థానికి ప్రజాధనం పక్కదారి.

జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు

నిత్యవసర సరుకుల ధరల పెంపు, పన్నుల భారంతో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు అన్నారు.

ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పివి. సురేష్ బాబు అధ్యక్షతన పట్టణంలోని 14 వ వార్డులో చేపట్టగా జీ.వీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు


SAKSHITHA NEWS