SAKSHITHA NEWS

అశ్వారావుపేట

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో వచ్చేది BRS ప్రభుత్వమే

ప్రతి కార్యకర్తకు అండగా ఉందాం

BRS వచ్చాక చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు తెలుపుదాం

ప్రజాసేవ , నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం

కుట్రలు చేయడం నాకు తెలియదు

నిత్యం ప్రజల్లో ఉంటున్నా

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి ఆదేశాలమేరకు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభ…. BRS జెండాను ఆవిష్కరించి సభలో ప్రసంగించిన MLA గారు. 5మండలాల BRS పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,4 మండలాల MPP లు,3మండలాల జెడ్పీటీసీ లు,MPTC లు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,వర్డ్ మెంబర్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సభ అనంతరం వచ్చిన అందరికీ స్వయంగా MLA గారు వడ్డించారు అలాగే ప్రతి ఒకరితో ఆత్మీయంగా మాట్లాడారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి తెలంగాణలో BRS ప్రభుత్వమే వస్తుందని,ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని,BRS ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,ప్రజా సేవ నియోజకవర్గ అభివృద్దే ఆయన లక్ష్యమని,కుట్రలు చేయడం రాదని,30సం రాజకీయ ప్రస్థానంలో నితి నీతి నిజాయతీగా బ్రతికానని,నిత్యం ఎదో ఒక కార్యక్రమంలో ప్రజల్లో ఉంటున్నానని,అభివృద్ది చేసి రేపు ఓట్లు అడుగుతానని,స్వార్థ రాజకీయాలు చేసే వారు ఓట్లు అడిగేందుకు వస్తుంటారని వారిని ప్రజలే నిలదీయాలని,పార్టీలకు అతీతంగా అభివృద్ది,సేవలు,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నైందని…ప్రతి BRS కుటుంబసభ్యులు ప్రజల్లోకి పథకాలను తీసుకువెళ్లాలని,అన్ని విధాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉన్నారని,,అడిగిన వెంటనే చేసి పెట్టే ముఖ్యమంత్రి ఉండగా మనకు వేరే ఆలోచనే అవసరం లేదని అన్నారు.


SAKSHITHA NEWS