ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఇబ్రహీం రైసీ సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆదివారం హెలికాప్టర్ కూలిపోయిందని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా అందరూ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఇబ్రహీం రైసీ మరణానంతరం ఇరాన్లో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ అధికారాన్ని చేపట్టారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరణిస్తే, ఉపాధ్యక్షుడు పదవిలో కొనసాగుతారు. గత రాత్రి ఇరాన్-అజర్బైజానీ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్ ప్రారంభోత్సవం అనంతరం ఇరాన్లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ కూడా మరణించినట్లు సమాచారం. ఇబ్రహీం రైసీ మరణానంతరం ఇరాన్లో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ పాలన సాగుతుందని మీడియా పేర్కొంది.
బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు
Related Posts
ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు
SAKSHITHA NEWS ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పుదక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో సవరణలు చేసినట్లు ఉత్తరకొరియా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యాయపరమైన సవరణలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు కిమ్ వ్యాఖ్యానించిన…
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం
SAKSHITHA NEWS అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం హైదరాబాద్:అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.…