SAKSHITHA NEWS

గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 3.70 మూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు GHMC అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఇందిరా నగర్ కాలనీ లో నెలకొన్న ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తిరినది అని, మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం గా దిశగా అడుగులు వేస్తున్నాం అని ,కాలనీ ప్రజలకు వర్షాకాలంలో నెలకొన్న ఇబ్బందులు, వరద ముంపు వంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకొని నేడు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపట్టడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేశారు. అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, రాబోయే వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని వరద నీటి కాల్వ నిర్మాణం పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది. వరద నీటి కాల్వ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి ,పరిసరాలు నీటమునిగిన పరిస్థితి  విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని ,నాలా లో పేరుకుపోయిన చెత్త, మట్టిని  పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా  ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని అధికారులు తెలియచేసారు.

అదేవిధంగా వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా వరద నీటి కాల్వ విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,వరద నీటి కాల్వ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.వరద నీటి కాల్వ నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు ,నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని,ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అదేవిదంగా GHMC అధికారులు సమన్వయం తో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో SE శంకర్ నాయక్, EE శ్రీకాంతిని AE సంతోష్ మరియు చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీనాయకులు అంజద్ పాషా, గిరి, అప్సర్ ,షరీఫ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS