SAKSHITHA NEWS

హైదరాబాద్:
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో ఐఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి బాబర్ సలీం పాషా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

హైదరాబాదులోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కేటీఆర్ ను కలిశారు. సీనియర్ కార్మిక నాయకుడైన బాబర్ సలీం పాషాకు కేటీఆర్ శాలువా వేసి సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ తో పాటు పలువురున్నారు.


SAKSHITHA NEWS