SAKSHITHA NEWS

భారతదేశ వాటికన్ రాయబారి
ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ఏలూరు పర్యటన సందర్భంగా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ ఏలూరులోని బిషప్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు . ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ
రాష్ట్రంలో అభివృద్ధి,సుభిక్షమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు.మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఏలూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేశారని.మేయర్ నూర్జహాన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,ఏలూరు శాసనసభ్యులు మరియు ఏలూరు నగర పాలక సంస్థ పాలకవర్గం,నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేయాలని ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ని మేయర్ షేక్ నూర్జహన్ పెదబాబు కోరారు.


SAKSHITHA NEWS