SAKSHITHA NEWS

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్


ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. హాఫ్ సెంచరీలతో దంచికొట్టిన కోహ్లీ, కేఎల్ రాహుల్ 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన మిషన్‌ను విజయంతో ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియాకు 2 పాయింట్లు లభించాయి.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.కాగా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

ఇద్దరూ ఆ విషయంలో వీక్‌గా ఉన్నారా..? ఈ ఐదు పదార్థాలతో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

ఛేజింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆరంభం అంతగా బాగోలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ జీరో పరుగులకే పెవిలియన్ చేరారు. టీమిండియా స్కోర్ 2 పరుగుల వద్ద ఔటయ్యారు.

దీని తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ విజయం సాధించింది. విరాట్ 85 పరుగులు, రాహుల్ 97 పరుగులు చేశారు. రాహుల్ సిక్సర్ కొట్టి భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించాడు..


SAKSHITHA NEWS