SAKSHITHA NEWS

స్వాతంత్ర్య అభ్యర్థి వెంకట ముత్యం నియోజకవర్గ కేంద్రంలో విస్తృత ప్రచార పర్యటన

అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రం అశ్వారావుపేట టౌన్ లో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం తరపున 2023 అసెంబ్లీ ఎన్నికలకు స్వాతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలపనున్న చిట్టి తల్లి సేవ సమితి అధ్యక్షులు మనుగొండ వెంకట ముత్యం విస్తృత పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. గురువారం అశ్వరావుపేట మండల కేంద్రంలో షాపు షాపుకు, ఆటో వ్యాన్ కారు, లారీ, ఆమాలి కార్మికులను, వ్యాపారస్తులను, ప్రజలందరూ కలుస్తూ వారి ఆశీర్వాదాలు ఉండాలని ఈసారి ఎన్నికలలో ఓటు తనకు వేయాలని, విజ్ఞత కలిగిన మేధావులారా ఆలోచించండి, గత పాలకులు చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో ఒక్కసారి ఆలోచించండి, ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటో, చెప్పినటువంటి వాటిలో చేసి చూపించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో కూడా మీరు నెమరువేసుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆలోచించి ఆ సమయాన్ని వృధా చేయడం తప్ప మాట ఇచ్చిన వాటిలో ఒక్కటైనా అమలు చేశారా అంటే శూన్యం అంటూ ప్రజలకు తెలియపరిచారు.

గత ఏడు సంవత్సరాలుగా చిట్టి తల్లి సేవ సమితి ద్వారా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని, పురిట్టి నొప్పుల బాధతో అల్లాడిపోతున్న వారిని, తేల్లు పాములు కరిచిన వారిని, క్షణకావేశంలో పురుగుల మందులు త్రాగి ప్రాణాలు మీదికి తెచ్చుకున్న వారినెందరినో మా ఉచిత అంబులెన్స్ ల ద్వారా ఆసుపత్రికి తరలించి ఎందరో ప్రాణాలు కాపాడడం జరిగిందని అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందరికో మనసు చలించి సహాయం చేయడం జరిగిందని నా సేవలు నిరంతరం కొనసాగించాలని అనుకుంటున్నానని వీటిని మరింత రెట్టింపు చేయడానికి మీలో ఒకడిగా మీ బాధ తెలిసిన వాడిగా మీ అమూల్యమైన ఓటు వెయ్యాలని వేడుకుంటున్నానని వారికి తెలుపుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, చిట్టితల్లి సేవా సమితి సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 03 At 3.01.13 Pm

SAKSHITHA NEWS