SAKSHITHA NEWS

బిఆర్ఎస్ పార్టీలో యువత ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ విజయం కాయం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

*
సాక్షిత : దేశ భవిష్యత్‌ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతుంది – ఎమ్మెల్యే కే పి వివేకానంద్..*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధలోని వెంకటేశ్వరా స్వామి ఆలయ చైర్మన్ వేణు యాదవ్ ఆధ్వర్యంలో మఖ్డూమ్ నగర్ నివాసి గణేష్ వారి మిత్ర బృందం సోమయ్య నగర్ లోని విజ్ఞాన వినాయక యూత్ అసోసియేషన్, మఖ్డూమ్ నగర్ లోని జై శ్రీరామ్ యూత్,పొలాల బస్తి లోని శివాజీ యూత్, జై మాత యూత్ అసోసియేషన్ నుండి 500 మంది యువకులు, మహిళలు వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కే.పి. వివేకానంద్

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన తొమిదిన్నరేన్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ ది అని, కెసిఆర్ నాయకత్వం కోసం యావత్‌ దేశం ఎదురు చూస్తున్నదని తెలిపారు, బీఆర్ఎస్ పార్టీ విజయానికి యువత కృషి చేయాలని సూచించారు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీ ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ విజయం కాయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మారయ్య, బండ మహేందర్, నాని, లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు ఇందిరా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 20 At 12.14.09 Pm

SAKSHITHA NEWS