SAKSHITHA NEWS

గడువులోపు పరిష్కరించకపోతే రోజుకు రూ. 100 చొప్పున అధికారులకు జరిమానా

గుంటూరు కలెక్టర్ వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు.గ్రామ, వార్డు సచివాలయం, ఏపీ సేవా, మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు గడువులోపు పరిష్కరించకపోతే రోజుకు రూ. 100 చొప్పున అధికారులకు జరిమానా విధించనున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గడువు దాటిన ప్రతి దరఖాస్తు రోజుకు రూ. 100 చొప్పున పరిష్కరించే వరకు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ఇందుగాను ప్రత్యేక ఖాతాను తెరవాలని ఉప కలెక్టర్కు ఆదేశించారు


SAKSHITHA NEWS