SAKSHITHA NEWS

సాక్షిత : *హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ రాజీవ్, వర్క్ ఇనస్పెక్టర్ మహదేవ్, జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర, జి హెచ్ ఎం సి ఎలక్ట్రికల్ లైన్ మెన్ సుధాకర్, తెరాస నాయకులు వెంకట్ రావు, సత్తార్, మల్లికార్జున్ రావు, బాల ప్రసాద్, నవీన్, విజయ్, ఖాజా, నరేష్, రాజు, ప్రవీణ్, గణేష్ ఖజమీయా, తాహెర్, బీజాన్బీ, జ్యోతి, జుబేద తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS