SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో రూ.30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్డు .
సాక్షిత : సి సి రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, సి సి రొడ్డుంపనులను పరిశీలించడం జరిగింది అని, అలానే శ్రీనివాస కాలనీ లో స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులకు కొరకు వచ్చిన పైపులను పరిశీలించాను అని, అలాగే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అదే విదంగా సిసి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, దేవి, కాలనీ వాసులు వెంకట రెడ్డి, శ్రీనివాస రెడ్డి, రాంబాబు, గోపాల్ రెడ్డి, రంగారావు, రాజు సాగర్, నవీన్ నాయుడు, సతీష్ వర్మ, సీతారామరాజు, మురళి, మాధవ్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS