SAKSHITHA NEWS

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని రేపటి నుండి నియోజకవర్గంలో చేపట్టబోయే ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం యొక్క వివరాలు వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ..

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…

ఉగాది పర్వదినం అనగా రేపటి నుండి మన బాపట్ల నియోజకవర్గంలో నేను చేపట్టబోయే ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం మధ్యాహ్నం 3 గం.లకు పిట్లవానిపాలెం మండలం, మంతెనవారి పాలెం గ్రామం నుండి మొదలపెట్టబోతున్నాను.

మీ మాట – నా బాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నియోజకవర్గంలో ని ప్రతి ఇంటికి వెళ్లి బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి మీద అందరి అభిప్రాయాలను తెలుసుకొని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధి కొరకు చేపట్టబోయే ప్రణాళికలు, ప్రజా సంక్షేమానికి అమలు చేసే పధకాలు, నా ఆలోచన విధానాలను వివరించడం.

ఉగాది పర్వదినం సందర్భంగా పీవీ పాలెం లోని నరసింహ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందుకొని తదనంతరం మధ్యాహ్నం 3 గం.లకు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి మంతెనవారి పాలెం నందు ప్రారంభించే ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని ప్రతి గడపను పలకరిస్తూ దాదాపు 6 నెలల పాటు 1000 కీమీ ల పాటు సాగుతోంది.

ఈ కార్యక్రమం ద్వారా 6 నెలల్లో నియోజకవర్గంలో ఉన్న దాదాపు 90000 ఇళ్ళ కు వెళ్లి మహిళ మణుల కోసం ప్రత్యేకంగా తెప్పించిన చీరను, నిత్యావసర వస్తువులు తెచ్చుకొనే సంచి, మరియు మా గురుంచి తెలియజేసే ఒక కరపత్రం అందజేసి వారి నుండి ఆశీస్సులు అందుకోవడం జరుగుతుంది.


SAKSHITHA NEWS