SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .


సాక్షిత : కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, యూజీడీ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ మరియు కాలనీ వాసులు యాది రెడ్డి, రామ కోటేశ్వర రావు, కృష్ణ మూర్తి, అందె నరసింహ, మదన్, సీత రాముడు, వెంకట్రామి రెడ్డి, రామేశ్వర్, బాబు రావు, బసవ లింగయ్య, ప్రకాష్, బసవ రాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS