SAKSHITHA NEWS

18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!

నేపాల్ కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే ఆయన అధిరోహించారు.

బుధవారం ఉదయం టిబెట్ లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఆయన ఈ రికార్డును అందుకున్నారు ఈ పర్వత శిఖరాలను సమీపించే కొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.


SAKSHITHA NEWS