SAKSHITHA NEWS

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు

— ఖమ్మం ఆర్యవైశ్య సంఘ నాయకులు కొదుమూరి మధుసూదన్ రావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

పేద, మధ్యతరగతి ఆర్యవైశ్యుల సంక్షేమాభివృద్ది కొరకు అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఆర్యవైశ్యుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సభ్యులందరూ రుణపడి ఉంటారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొదుమూరి మధుసూదన్ రావు మాట్లాడుతూ… గత 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఆర్య వైశ్యులు పేద, మధ్యతరగతి జీవితాలను గడువుతున్నారని, వారి సంక్షేమ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కార్పొరేషన్ విధివిధానాలు కూడా ప్రకటించి ఆర్యవైశ్యుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఖమ్మం జిల్లా వాసవి క్లబ్ సేవాదళ్ అధ్యక్షులు గంగిశెట్టి వెంకటేశం, కాంగ్రెస్ జిల్లా నాయకులు సోమ సత్యనారాయణ, జిల్లా నాయకులు నల్లాల విశ్వేశ్వరావు, డోగిపర్తి నగేష్ కుమార్, మేళ్లచెర్వు హనుమంతరావు, టిఎస్ చక్రవర్తి, కొదుమూరి ఉమేష్, కొదుమూరి భద్రయ్య, మేళ్లచెర్వు కేశవరావు, వెచ్చ చలపతిరావు, ఆకుల శ్రీను, ఎ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS