SAKSHITHA NEWS

Great ideas are possible for CM KCR: JDP Chairman Putta Madhukar

గొప్ప ఆలోచనలు సీఎం కేసీఆర్‌కే సాధ్యం: జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్

వివిధ దృష్టిలోపాల నివారణకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ తెలిపారు.

సాక్షిత న్యూస్, మంథని:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడతను మంథని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ..
మనకు తెలియకుండానే అనేక దృష్టి సమస్యలు తలెత్తుతాయని, అలాంటి వారికి తమ ఇంటి ముందుకే పరీక్షలుచేసుకునే విధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటి వెలుగును తీసుకువచ్చారన్నారు. కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఈ కంటి వెలుగును అమలుచేయడం జరుగుతోందని, రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రతి ప్రభుత్వ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నారని ఆయన వివరించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా గొప్పగా ఆలోచన చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చేపట్టిన కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కంటి వెలుగును విజయవంతం చేయడంలో అధికారులు అవసమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా తాను అందుబాటులో ఉంటాననే విషయాన్ని అధికారులు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS