SAKSHITHA NEWS

ఉమ్మడి ప్రకాశం జిల్లా

కందుకూరు నియోజకవర్గం లోని వలేటివారిపాలెం మండలం పరిధిలో ఉన్నటువంటి మాలకొండ లోని మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దేవస్థానమునకు ట్రస్ట్ చైర్మన్ గా బీసీలకు ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ వారి ఓట్లను లాక్కుంటూ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి బీసీల పైన మరొకసారి కపటం చూపిస్తూ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా బీసీలను ఎందుకు కేటాయించడం లేదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పివి రమేష్ యాదవ్ కందుకూరు పట్టణ అధ్యక్షులు వైయస్సార్సీపిని ప్రశ్నిస్తున్నాం.

గత ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు రెండుసార్లు చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది అలాగే వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీసీలపై ప్రేమ ఉండి బీసీలపై గౌరవం ఉండి చైర్మన్ పదవి గత ప్రభుత్వంలో ఇచ్చినారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరియు శాసన సభ్యులు బీసీలపై ఎందుకు ప్రేమ చూపించలేకపోవడం బీసీలకు ఎందుకు చైర్మన్ పదవి కేటాయించకపోవడం కనుక బీసీలకు చైర్మన్ పదవి కేటాయించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరడం అవుతుంది కావున మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి చైర్మన్ పదవి బీసీలకు కేటాయించి వైయస్సార్సీపి బీసీలపై ఉన్నటువంటి నమ్మకం మరియు వారి యొక్క ప్రేమ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది


SAKSHITHA NEWS