SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.పటాన్చెరు లోని పలు పాఠశాలల విద్యార్థులు,ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ ప్రభాకర్ , జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి ,ఎంపీపీ సుష్మా వేణు గోపాల్ రెడ్డి ,సీఐ వేణుగోపాల్ రెడ్డి , దశ్రత్ రెడ్డి ,
మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ , డివిజన్ అధ్యక్షులు ఆఫ్జల్ , పట్టణ పుర ప్రముఖులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS