SAKSHITHA NEWS

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..
సాక్షిత : దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ నగర్ ఫేస్ 2 పరిసర ప్రాంతాలలో తెరాస పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ వర్షం కారణంగా రిపేర్ లో ఉన్న స్ట్రీట్ లైట్స్, మరియు డామేజ్ అయిన డ్రైనేజ్ కవర్ వెంటనే వేయించే ప్రయత్నం చేస్తానని.. డివిజన్ లో 90 శాతం పనులు పూర్తయ్యాయని పెండింగ్ లో ఉన్న 10 శాతం పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని. కాలనీలలో స్థానికులు వర్షాల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా సమస్యలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, వెంకటేష్, జగదీష్, నిరంజన్ గౌడ్, శివరాజ్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, మోజెస్, జాన్, యాదగిరి, శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ, రాములుగౌడ్, మురళీకృష్ణ, అశోక్, రాజుపటేల్, సంతోష్, రవీందర్, మారుతి, శ్రీనివాస్, స్వామి, మోహన్, శ్రీధర్, శివ, కూర్మయ్య, జయనుద్దీన్, అనిల్, విరేశం, రఘునందన్, సత్యనారాయణ, శరణప్ప, మధుసూదన్ రెడ్డి, రామచంద్రుడు, మారుతి రెడ్డి, ఎం.డి.మోసిన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS