SAKSHITHA NEWS

శంకర్‌పల్లి: మరకత శివాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా: చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్

శంకర్‌పల్లి: మార్చి 24: ( సాక్షిత న్యూస్): శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. ఆదివారం శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల మరకత శివాలయంలో జ్యోతి బీమ్ భరత్ దంపతులు స్వామి వారికి ఆలయ ప్రధాన పూజారి సాయి శివ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జ్యోతి బీమ్ భరత్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ సదానందం గౌడ్ జ్యోతి భీమ్ భరత్ దంపతులకు స్వామివారి శేష వస్త్రాన్ని మెడలో వేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో మునిసిపల్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS