SAKSHITHA NEWS

యర్రగొండపాలెం :
విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించినట్లు విద్యా శాఖ అధికారి వెల్లడి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం12(1సి) ప్రకారం 2023-24 విద్యా సంవ త్సరానికి వై పాలెం లోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలోని 1వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికై న అర్హుల జాబితాను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మండలం లో దరఖాస్తు చేసిన 30మందిలో అర్హత పొందిన వారిలో నుంచి.. మొదటి లాటరీ విధానంలో ఎంపికైన7మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వారిని ఈ రోజు చైతన్య లో5, ఉదయ్1, నలందలో ఒకరిని చేర్చినట్లు ఎంఈఓ తెలిపారు. అనంతరము ఎస్ ఏ 2పరీక్షలు సరళిని పరిశీలించారు . ఈ కార్యక్రమంలో చైతన్య, ఉదయ్ కరస్పాండెంట్స్ ఎస్ లక్ష్మి, సాలిగ్రామ,ఉపాద్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS