SAKSHITHA NEWS

సాక్షిత : ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని రైల్వే వంతెన పున నిర్మాణ కోసం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి * చామకూర మాల్లారెడ్డి ,* మాల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ * భద్రారెడ్డి ,* RDO రాజేష్ కుమార్ ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ * ముల్లి పావని జంగయ్య యాదవ్ ,* వైస్ ఛైర్మన్ పలుగుల మాధవ రెడ్డి , సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రాం రెడ్డి , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి , BRS పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ,

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో గత 12 సంవత్సరాలు గా ఘట్కేసర్ మునిసిపాలిటీ లో రైల్వే వంతెన నిర్మాణంలో జాప్యం వలన ప్రజలకు చాలా ఇబంది కారణంగా ఉండేదని చాలా మంది ప్రాణాలు సైతం పోవడం జరిగిందని వీటన్నింటినీ గతంలో ఉన్న కాంట్రాక్టర్ యొక్క తప్పిదాలే అని ఇప్పుడు అతని స్థానంలో నూతన నూతన టెండర్ ను వేపిస్తూ గతంలో ఉన్న కాంట్రాక్టర్ యొక్క టెండర్ ను రద్దు చేయడం, పాత కాంట్రాక్టర్ స్థానం లో నూతన కాంట్రాక్టర్ కు టెండర్ వేసుకునే విధమైన చర్యలు R&B అధికారులు చేపట్టారని, అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన రైల్వే వంతెన నిర్మాణ కొరకు టెండర్ KSR ఇన్ఫ్రా హోల్డింగ్స్ వారికి రావడం తో వంతెన నిర్మాణం కొరకు ఘట్కేసర్ మునిసిపాలిటీ ప్రజలతో, నాయకులతో, కుల సంఘాలతో కలిసి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు…
అదేవిధంగా భునిర్వాసితులతో చర్చించి వారికి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని తెలుపుతూ, రెవెన్యూ అధికారులకు, సంబంధిత కాంట్రాక్టర్ కు అతి త్వరలో వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.అనంతరం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని దేవాలయాలు మంత్రివర్యులు తమ సేవ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్థానాన్ని హామీ తెలుపగా మంత్రి కి ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు…

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి , రమాదేవి , బొక్క సంగీత , బండారు ఆంజనేయులు గౌడ్ , బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్ , కడుపొల్లా మల్లేష్ , బత్తుల నరేష్ యాదవ్ , బేతల నర్సింగ్ రావు , కుతాది రవీందర్ , కో-ఆప్షన్ సభ్యులు sk షౌకత్ మియా , BRS వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపాల సుధాకర్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేష్ ముదిరాజ్ , వెంకటేశ్వరరావు , R&B అధికారులు, బ్యాంకు డైరెక్టర్ లు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ వార్డు సభ్యులు, కుల సంఘాల పెద్దలు, వివిధ హోదాలో ఉన్న BRS నాయకులు, ప్రజాలు, BRS పార్టీ కార్యకర్తలు, మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….


SAKSHITHA NEWS