SAKSHITHA NEWS

సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహాత్మా జ్యోతి రావ్ పూలె జయంతి సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్త్రీల హక్కుల కోసం, బాలికల చదువుకోసం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పూలె పోరాట స్పూర్తితో తెలంగాణ లో కేసీఆర్ నియంత పాలనను తరిమికొట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, డివిజన్, వివిధ మోర్చాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS