SAKSHITHA NEWS

పలువురు ప్రముఖులను పరామర్శించి, పలు శుభకార్యాల లో పాల్గొన్న……. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

సాక్షిత వనపర్తి జూన్ 23
పట్టణంలో ప్రముఖ డాక్టర్లు లివింగ్స్టన్, డాక్టర్ మురళీధర్ రమేష్ బాబు లు గుండె చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు అన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా ఆదివారం వారి నివాసాల వద్దకు వెళ్లి ఆరోగ్య, యోగక్షేమాలనుఅడిగి తెలుసుకున్నారు వారు త్వరగా కోలుకొని డాక్టర్లుగా వారి సేవలను ఈ సమాజానికి అందివ్వాలని కోరారు.అనంతరం గోపాల్పేట మండలానికి చెందిన సాక్షి రిపోర్టర్ యాసీన్ మరణించిన తర్వాత సహనాజ్ బేగం కు చిట్యాల రోడ్డు వద్ద ఉన్న డబల్ డబల్ బెడ్ రూమును ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది యాసీన్ భార్య సహనాజ్ పిలుపుమేరకు ఆ ఇంటి నీ రిబ్బన్ కట్ చేసి వారిని గృహప్రవేశం చేయించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు జర్నలిస్టు నిరంజన్ ఇండ్లకు వెళ్లి వారిని వారి కుటుంబాల యోగక్షమా లను అడిగి తెలుసుకున్నారు అలాగే టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫజల్ కుమార్తె బర్త్డే వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ రమేష్ గౌడ్ నందిమల అశోక్ చిట్యాల రాము, తోట శ్రీను తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS