SAKSHITHA NEWS

నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి.వీపనగండ్ల మండలాల పరిధిలోని గ్రామాలలో వివిధ ఆరోగ్య కారణాలతో మృతి చెందిన పలువురికి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించారు…

పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామ ఉపసర్పంచ్ దేశమోని విష్ణువర్ధన్ రావు సతీమణి హేమలత అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు గ్రామ సర్పంచ్ ధ్వరా విషయం తెలుసుకున్న జూపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు…

వీపనగండ్ల మండల పరిధిలోని తూముకుంట గ్రామానికి చెందిన పెద్ది బాలరాజు నేటి ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు విషయం తెలుసుకున్న జూపల్లి నివాసానికి వెళ్లి వారి భౌతికకాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సంధర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు వారితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్ లు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు…


SAKSHITHA NEWS