SAKSHITHA NEWS

First comprehensive development with TRS

టిఆర్ఎస్ తోనే మునుగోడు సమగ్ర అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

……

సాక్షిత : టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి చౌటుప్పల్ లో భారీ ర్యాలీ

ఘన స్వాగతం కలిసిన కార్యకర్తలు, ప్రజలు

హాజరైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు

చౌటుప్పల్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13 వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం ఆయా వార్డుల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

.

ర్యాలీ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ మునుగోడు సమగ్ర అభివృద్ధి కోసం టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి డబ్బులను పంచి విజయం సాధించ వచ్చని భ్రమలో ఉన్నారని, ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


SAKSHITHA NEWS