SAKSHITHA NEWS

ఈరోజు, రేపు గ్రాండ్ బాలాజి హోటల్ , ఎంజి రోడ్ నందు డైమండ్, బంగారు ఆభరణాల అమ్మకం

ఇఎమ్ ఐ సౌకర్యంతో అమ్మకాలు

హైదరాబాదు జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 నందు గల బంగారు, డైమండ్ నగల వ్యాపార సంస్థ వసుంధర జ్యువ్వెల్లర్స్ వారి ఆధ్వర్యంలో సూర్యాపేట గ్రాండ్ బాలాజి హోటల్ నందు ఈ రోజు, రేపు బంగారు నగల అమ్మకాల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సంస్ధ ఎజిఎమ్ జ్ఞానేశ్వర్ తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి వసుంధర జ్యువ్వెలర్స్ సంస్ధ నాణ్యతగల బంగారు, డైమండ్ నగల అమ్మకాలతో కస్టమర్ ల ఆదరాభిమానాలు పొందుతూ తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మందికి నమ్మకమైన వ్యాపార సేవలను అందిస్తుందని అన్నారు.

సూర్యాపేట పట్టణంలో అనేక సంవత్సరాల నుండి తమ సంస్ధ తయారు చేస్తున్న బంగారు, డైమండ్ ఆభరణాల అమ్మకాలు చేస్తూ కస్టమర్ ల విశ్వాసం పొంది, ఈ సంవత్సరం మరొకసారి సూర్యాపేట పట్టణంలోని ఎంజి రోడ్ గ్రాండ్ బాలాజి హోటల్ నందు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సూర్యాపేట జిల్లా మహిళలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్ధ సిబ్బంది మహేందర్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 18 At 3.01.13 Pm

SAKSHITHA NEWS