SAKSHITHA NEWS

Everyone should work towards the goal of winning BJP in Manthani

మంథని లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

మంథని నియోజకవర్గ పదాధికారుల, ముఖ్య కార్యకర్తల సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు…

సాక్షిత న్యూస్, మంథని:

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ బీజేపీ పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ లోని అన్ని మండలల అధ్యక్షులు, మండలల ఇంచార్జ్ లు, మండలాల ప్రధాన కార్యదర్శుల, జిల్లా సీనియర్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇంచార్జ్ రావుల రాంనాథ్, ప్రబరి అనిల్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ….
మంథని లో బీజేపీ రోజు రోజుకు విపరీతంగా బలపడుతోందని, ప్రతిఒక్కరూ గెలుపే లక్ష్యంగా పని చేయాలని, కెసిఆర్ నియంత, కుటుంబ పాలనకి బీజేపీ తో స్వస్తి పలకాలనీ పిలుపునిచ్చారు.
గ్రామ స్థాయి నుండి బూత్ కమిటీ లను పూర్తి చేయాలని, ఈనెల 7వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో మంథని ఎస్ ఎల్ బి ఫంక్షన్ హాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ తో వర్చువల్ మీటింగ్ ఉంటుందని కార్యకర్తలకు గుర్తు చేశారు.
ఈ ప్రాంతం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి చుట్టం చూపుగా నియోజకవర్గం లో తిరుగుతున్నాడని, మన ప్రాంతం నుండి బొగ్గు, ఇసుక, నీళ్లు, నిధులు తరలించకు పోతూ మంథని ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంధర్భంగా మండలాలలో పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి కొత్త ఇన్చార్జిలను నియమించడం జరిగిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బిజెపి అధికారం లోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, మహావాది రామన్న, విజయ్ కుమార్, మండల అధ్యక్షులు వేల్పుల రాజు, జంగపల్లి అజయ్, మల్కామోహన్ రావ్, సిరిపురం శ్రీమన్నారాయణ, బొమ్మన భాస్కర్ రెడ్డి, కోయల్ కార్ నిరంజన్, మండలాల ఇంచార్జ్ లు బోగోజు శ్రీనివాస్, మట్ట శంకర్, ఎడ్ల సదాశివ్, బిరుదు గట్టయ్య, ఉడుముల విజయ రెడ్డి, బండ వసంత రెడ్డి, మచ్చగిరి రాము, ఆకుల శ్రీధర్, పగే రంజిత్, రామగిరి నాగరాజు, చిలువేరి సతీష్, మండల ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS