కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ వాసులు ఇటీవల సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారంటీలకు మరియి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీయార్ నియంత పాలనకు చరమగీతంపాడే రోజు త్వరలోనే ఉందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీలను తీసుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలనీ కోరారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, INTUC నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…