SAKSHITHA NEWS

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి మరియు టెలికాం నగర్ కాలనీలలో రూ.110.50 ఒక కోటి పది లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయంతో చెపట్టబోయే UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా మరియు జలమండలి అధికారుల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రికెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, డ్రైనేజి సమస్య కి శాశ్వత పరిష్కారం చూపుతామని,గౌలిదొడ్డి మరియు టెలికాం నగర్ కాలనీలలో నెలకొన్న ఎన్నో ఏండ్ల డ్రైనేజి సమస్య నేటి తో తిరునని,UGD శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుంది అని, కాలనీ వాసులకు ఉపశమనం లభిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,UGD నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని,ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.గౌలిదొడ్డి లో రూ.87.50లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు

2.టెలికాం నగర్ లో రూ.23.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM రాజశేఖర్, DGM శరత్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి మరియు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, శ్రీను పటేల్, మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, జంగయ్య యాదవ్,Md ఇబ్రహీం , సురేష్ నాయక్, ప్రసాద్, రమేష్, నరేష్, శంకరి రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్, రాచులూరి జగదీశ్,మరియు నాయకులు రామేశ్వరమ్మ,అంజమ్మ నారాయణ,గోవింద్, మహేష్, నగేష్,అనిల్ సింగ్,మాధవి, బాలమణి, సుగుణ, తదితరులు పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS