ఉమ్మడి సాక్షిత:
మార్చి,01 నుండి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండల తహశీల్దారు కార్యాలయంలో దరణి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు, ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్దేశిత సమయంలోగా దరఖాస్తుల ప్రకారం రికార్డులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. మండలాల పరిధిలో ధరణి మాడ్యూల్స్ ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల వారీగా వ్యవసాయా విస్తరణ అధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఆర్ఐలు, డిటిలతో కూడిన బృందం ఆర్జిదారుల భూములను పరిశీలించి రికార్డులో ఉన్న వాటిని సరిపోల్చుకొని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.
ఖమ్మం రూరల్ తహశీల్దారు పి.రాంప్రసాద్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలి -జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…