SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా, : రంజాన్ తోఫా అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .*
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం, సోదర సోదరీమణులు ఉపవాసాలు ఉండి సమాజంలోని పేదలకు దాన ధర్మాలు చేయటం ఎంతో గొప్ప విషయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని వైఎస్సార్ కాలనీలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరీమణులకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు చీరెలను పంపిణీ చేశారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు.


పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ, ఆకలి బాధలు స్వయంగా తెలుసుకుంటూ, తోటివారికి సాయపడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో పయనిస్తున్నారని పేర్కొన్నారు.
శాంతి, సోదరభావం, ఐకమత్యం, దాతృత్వానికి ప్రతీక రంజాన్ మాసం అన్నారు. ఈ రంజాన్ మాసంలో అందరి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS