SAKSHITHA NEWS

సాక్షిత  అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పంచాయితీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
సూచనల మేరకు నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కొండరెడ్ల కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేశారు.


నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా మరియు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సహకారంతో బిర్రం వెంకటేశ్వరావు మండలంలో అనేక గిరిజన గ్రామాల్లో దుప్పట్లు మహిళలకు, వికలాంగులకు బట్టలు పంపిణీ , హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్న, పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ జుజ్జూరి రాంబాబు, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ చెన్నరావు, పానుగంటి లక్ష్మణరావు, జుజ్జురీ సత్యనారాయణ పాల్గొన్నారు


SAKSHITHA NEWS