SAKSHITHA NEWS

శంకర్‌పల్లిలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాలను ఎగురవేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకయ్య గౌడ్

సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో వెంకయ్య గౌడ్, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ జాతీయ జెండాలను ఎగరవేసి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిని గుర్తు చేస్తూ చెడుపై పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగింది కానీ తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలగలేదన్నారు. మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో విలీనమైన
ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, తహశీల్దార్ సురేందర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS