SAKSHITHA NEWS

దళిత బంధు పథకంతో ఆర్థిక సమానత్వానికి కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత, : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్ గ్రామానికి చెందిన దేవదాస్ కు దళిత బంధు పథకం లో మంజూరైన టెంట్ హౌస్ ను ప్రారంభించారు.

▪️ ధారూర్ మండలకేంద్రంలో ధారూర్ గ్రామానికి చెందిన అంజయ్యకు దళిత బంధు పథకం లో మంజూరైనా స్యారీ సెంటర్ ను మరియు నాగసముందర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కు దళిత బంధు పథకంలో మంజూరైనా ఆన్లైన్ & మొబైల్ సెంటర్ ను ప్రారంభించారు.

▪️ వికారాబాద్ పట్టణ కేంద్రంలో ధారూర్ మండల పరిధిలోని ధర్మపూర్ గ్రామానికి చెందిన నందు కు దళిత బంధు పథకం లో మంజూరైనా కిరాణా & జనరల్ స్టోర్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS