SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు జిట్టా స్వామి జిట్టా నరసమ్మ క్యాన్సర్ వ్యాధి రావడంతో చికిత్స తీసుకుంటున్న ఆమెని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని చికిత్స నిమిత్తం 10వేల రూ.ల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఆరోగ్యం మెరుగవుతుందని అధైర్య పడవద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి
కౌన్సిలర్ జమండ్ల శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు కందాటి రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు పాల శివ కుమార్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు జంపాల వెంకన్న, వల్లమల యాదగిరి రెడ్డి, శేఖర్, లింగస్వామి, బాలకృష్ణ, నాగరాజు, విష్ణు, యం.డి యూసుఫ్, పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నా
రు.


SAKSHITHA NEWS